రెబ్బెన/ జైనూర్ : ఆడబిడ్డలకు తెలంగాణ సర్కారు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు కానుకగా ఇస్తుందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. శనివారం రెబ్బెన, జైనూర్ మండలాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ దేశ ఎల్లలు దాటి గుర్తింపు రావటం సంతోషకరమైన విషయం అన్నారు. తెలంగాణ ఆడపడుచులు అందరూ ఆనందంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు అందిస్తున్నారని వివరించారు.
వివిధ రకాల రంగు, రంగుల డిజైన్ లతో అందమైన చీరలు అందించి బతుకమ్మ పండుగ ఆనందాన్ని రెట్టింపు చేయడంతో మహిళలు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోశ్ , పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం , సర్పంచ్ బొమ్మినేని అహల్యదేవి, ఉపసర్పంచ్ మడ్డి శ్రీనివాసగౌడ్ , ఎంపీటీసీలు పెసరి మధునయ్య, సంగం శ్రీనివాస్, ఆడిపాడారు. జైపూర్లో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్లాల, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్రావు, ఎంపీపీ కుమ్ర తిరుమల, ఎంపీడీవో ప్రభుదయ, తాసిల్దార్ సాయన్న, సీడీపీవో ఇందిరమ్మ, ఏపీఎం సుజాత, వైస్ఎంపీపీ చిర్లెలక్ష్మణ్, మండల కోఆప్షన్ సభ్యుడు ఫెరోజ్ఖాన్, పలువురు పాల్గొన్నారు.