అన్నింటినీ కైవసం చేసుకున్న టీఆర్ఎస్
అభ్యర్థులకు పత్రాల అందజేత
నామినేషన్ పత్రాలు అందజేస్తున్న డీసీసీబీ చైర్మన్ నాందేవ్కాంబ్లే, నాయకులు
తాంసి, జూలై 19 : ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న డీసీసీబీ(డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్) మూడు డైరెక్టర్ స్థానాలకు సోమవారం నామినేషన్లు స్వీకరించారు. రెండు ఎస్సీ స్థానాలు, ఒక బీసీ స్థానానికి ఒక్కొక్కరు చొప్పున దరఖాస్తు చేసుకోగా.. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా సహకార శాఖ, ఎన్నికల అధికారి శ్రీనివాస్ ప్రకటించారు. ఎన్నికైన దుర్గం లక్ష్మి (ధర్మాజీపేట), వెంకటేశ్ (కుంటాల), ప్రభాకర్రావు (మందమర్రి)కు నియామక పత్రాలు అందజేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న మూడు డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్) డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు జిల్లా సహకార శాఖ, ఎన్నికల అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీబీలో సోమవారం ఉదయం నామినేషన్లను స్వీకరించారు. ఇందులో ఎస్సీ 2, బీసీ 1 ఖాళీగా ఉన్నట్లు ఆయన తెలిపారు. మూడు స్థానాల(ధర్మాజీపేట, కుంటాల, మందమర్రి)కు ఒక్కో నామినేషన్ మాత్రమే రావడంతో ఏకగ్రీవం చేసినట్లు చెప్పారు. ఇందులో రెండు ఎస్సీ స్థానాలకు దుర్గం లక్ష్మి (ధర్మాజీపేట), తూర్పాటి వెంకటేశ్(కుంటాల), బీసీ స్థానానికి ప్రభాకర్రావు (మందమర్రి) ఎన్నికైనట్లు వెల్లడించారు. అనంతరం వారికి నియామక పత్రాలను అందజేశారు.
మూడు స్థానాలు ఏకగ్రీవం..
డీసీసీబీలో ఖాళీగా ఉన్న మూడు డైరెక్టర్ స్థానాలను అధికార టీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది. డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే, వైస్ చైర్మన్ రఘునందన్రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికలకు ఇన్చార్జిగా డైరెక్టర్ బాలూరి గోవర్ధన్రెడ్డిని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నియమించారు.