ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 4348 మంది విద్యార్థుల హాజరు
కొవిడ్ నిబంధనల మధ్య నిర్వహణ
ఆదిలాబాద్ రూరల్, జూలై 17: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఇందుకోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తొమ్మిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్ల్లు రీజినల్ కోఆర్డినేటర్ భరద్వాజ్ తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పా టించారు. ఒక్కో బేంచీకి ఒక్క విద్యార్థిని మా త్రమే కూర్చోబెట్టారు. విద్యార్థులను 10 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాల గేటు వద్దే ప్రతి ఒక్కరికీ థర్మల్స్క్రీనింగ్ చేస్తూ లోనికి అనుమతించారు. కాగా.. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు జిల్లా నుంచి 1,952మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,794 మంది పరీక్షకు హాజరుకాగా, 158 మంది గైర్హాజరైనట్లు ఆర్సీవో తెలిపారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ అర్బన్, జూలై 17 : పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కోసం శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇందుకోసం నిర్మల్ జిల్లాలో 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,744 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 2554 మంది హాజరయ్యారు. 190 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు గంట ముందే చేరుకున్నారు. విద్యార్థులతో పాటు అధ్యాపకులు, సిబ్బంది మాస్కులు ధరించారు. పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. కొవిడ్ నిబంధనల మధ్య పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపాల్ అన్నపూర్ణ తెలిపారు.