ఆదిలాబాద్ రూరల్, జూలై 15: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి అన్నారు. మావల మండలం వాఘాపూర్ పరిధి కొలాంగూడలో గురువారం మొక్కలు నాటారు. అనంతరం గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మయూరి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జూలై 15 : హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, సర్పంచ్ కోరెంగా గాంధారి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయుడు గోపాల్సింగ్ తిలావత్ ఆధ్వర్యంలో గురువారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సిరికొండ,జూలై 15: హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ బతికించాలని ఉపాధి హామీ టీఏ సుభాష్ అన్నారు. మండలంలోని రాజంపేట్లో గ్రామస్తులతో కలిసి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ అనిల్, కార్యదర్శి,అరుణ్,యూత్ అధ్యక్షుడు నాగోరావ్ మొక్కలు నాటారు.గ్రామంలో పచ్చదనం పెంపొందిం చాలన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.