స్త్రీ పురుషుల శరీరతత్వం వేరు. స్వభావాలు వేరు. పురుషులు సహజంగానే ఆరోగ్యం విషయంలో కొంత అశ్రద్ధగా ఉంటారు. ఫలితంగా సమస్య కొన్నిసార్లు తీవ్రంగా మారుతుంది. కాబట్టి, రుగ్మత ప్రాథమిక దశలో ఉన్నప్పుడే గుర్తించి చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా 40 ఏండ్లు దాటిన వాళ్లు, ఏడాదికి ఒకటిరెండు సార్లు అయినా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.