నడక పోటీల్లో తిమ్మాపురం జడ్పీపాఠశాలఉపాధ్యాయుడి ప్రతిభ
జాతీయ స్థాయి టోర్నమెంట్కు ఎంపిక
సంగెం, మార్చి 29: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. దానిని ఆచరణలో పెట్టి ఆరోగ్యంగా ఉండడానికి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రతి రోజూ సాధన చేస్తూ నడక పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఆదర్శంగా నిలుస్తున్నాడు.మండలంలోని తిమ్మాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న మాలకుమ్మరి రాజు నడక పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చాడు. 2002 సంవత్సరంలో ఉపాధ్యాయుడి గా చేరిన రాజు 2016 సంవత్సరంలో అధిక బరువు, పొట్టను తగ్గించుకునేందుకు నడక (వాకింగ్) చేయ డం ప్రారంభించాడు. ఆహార నియమాలు పాటిస్తూ ప్రతిరోజూ ఉదయం నడవడం అలవాటుగా మార్చుకున్నాడు. 2019 సంవత్సరంలో సీకేఎం కళాశాల మైదానంలో నిర్వహించిన నడక పోటీల్లో పాల్గొని జిల్లా స్థాయిలో బెస్ట్ వాకర్గా చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. 2020 జనవరి 18న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని 5 కిలోమీటర్ల విభాగంలో ద్వితీయస్థానంలో నిలిచారు.
ఫిబ్రవరి 2020లో హర్యానాలో నిర్వహించిన ఆల్ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 5 కిలోమీటర్ల విభాగంలో ఐదో స్థానంలో నిలిచాడు. 2021 ఫిబ్రవరిలో దుండిగల్, మేడ్చల్లో నిర్వహించిన తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ చాంపియన్షిప్ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలి చి ఆల్లిండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్కు ఎంపికయ్యాడు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఉపాధ్యాయుడు రాజును పాఠశాల ఉపాధ్యాయులు పూలమాలలు, శాలువాలు, మెమెంటోలతో సత్కరించారు. నడక పోటీల్లో పాల్గొంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయుడు రాజు అంతర్జాతీయ పోటీల్లో రాష్ర్టానికి పేరు తీసుకు వస్తారని ఆశిద్దాం..
బంగారు పతకం సాధించడమే లక్ష్యం
అంతర్జాతీయ నడక పోటీల్లో బంగారు పతకం సాధించడమే నా లక్ష్యం. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం గంటపాటు వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. మా కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యంపై అవగాహన కల్పించి కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించాను. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు.
ఎం రాజు, గణిత ఉపాధ్యాయుడు