బిగ్బాస్ భామ అశు రెడ్డి పేరు సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా బాగా వినిపిస్తుంది. అలా వినిపించాలనే వివాదంలో ఇరుక్కున్నట్లు అనిపిస్తుంది కూడా. ఎందుకంటే ఈమె చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు కాంట్రవర్సీలో పడేసింది. అదే ఇప్పుడు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చి పెడుతుంది. పవన్ కళ్యాణ్ విషయంలో ఈమె చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఈ మధ్య టీవీలో కామెడీ స్టార్స్ తో కనిపిస్తున్న అశు రెడ్డి.. బిగ్ బాస్ 3తో పాపులర్ అయింది. ఈమెకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. ఆయన పేరును ఏకంగా తన బాడీలోని ప్రైవేట్ పార్టులో టాటూగా వేయించుకుంది. తను పవన్కు భక్తురాలిని.. ఆయన తనకు దేవుడు అంటూ చెప్పుకొచ్చింది అశు రెడ్డి. అక్కడి వరకు బాగానే ఉంది కానీ మొన్న ఈమె చేసిన కామెంట్స్ అందరికీ కోపం తెప్పించాయి.
ఈ మధ్యే పవన్ కళ్యాణ్ను ప్రత్యేకంగా కలిసింది అశు రెడ్డి. అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన తనకు కాఫీ ఆఫర్ చేశాడని.. రెండు గంటల పాటు పవన్తో మాట్లాడుతూ అలాగే ఉండిపోయానని చెప్పుకొచ్చింది అశు. అక్కడి వరకు కూడా బాగానే ఉంది. కానీ ఆయనతో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అశు. అందులోనే తనకు పవన్పై ఉన్న ప్రేమను బయటపెట్టింది. దాంతో నెటిజన్లు ఊరికే ఉండకుండా పవన్కు నాలుగో భార్యగా వెళ్తావా అని అడిగారు. దానికి వెంటనే ఈమె కూడా ఓకే అని చెప్పింది. చెప్పినపుడు తెలియలేదు ఇదంతా ఇంత పెద్ద సెన్సేషన్ అవుతుందని. కానీ ఇప్పుడు అయింది. పవన్ కు నాలుగో భార్యగా ఉండటానికి.. వెళ్లడానికి తనకేం అభ్యంతరం లేదని అశు రెడ్డి చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. పబ్లిక్ ప్లాట్ ఫామ్ లో అలా బరితెగించి ఇలా మాట్లాడతావా అంటూ ఈమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయంపై అశు రెడ్డి స్పందించింది. నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్లు రాయడం ఎంత వరకు కరెక్ట్.. పవన్ ను చేసుకుంటానని నేను చెప్పానా అంటూ ఫైర్ అయింది. పిచ్చిపిచ్చి రాతలు రాస్తే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చింది. తప్పుడు వార్తలు రాసి అనవసరంగా తన ఇమేజ్ తీయొద్దంటూ అశు రెడ్డి సీరియస్ అయింది. రెండు రోజులుగా సోషల్ మీడియాలో వచ్చిన హెడ్ లైన్స్ చూసి చూసి పిచ్చెక్కి ఇది మాట్లాడుతున్నా అంటూ ఫైర్ అయిపోయింది అశు రెడ్డి.