Telangana Tourism Packages From Hyderabad | సమ్మర్ వచ్చేసింది…! అయితే చాలా మంది కొత్త కొత్త ప్లేస్ లను చూసేందుకు ప్లాన్ చేసే పనిలో ఉంటారు. కొందరు అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే… మరికొందరూ సేద తీరే ప్రాంతాల కోసం చూస్తుంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది తెలంగాణ టూరిజం. తాజాగా ఎల్లోరా అందాలతో పాటు షిరిడీ (Shiridi), శని శింగణాపూర్ (Shani Shinganapur) ప్రాంతాలను చూసేలా సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. “Shirdi Ellora Tour” పేరుతో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది.
షిరిడీ ఎల్లోరా టూర్ (Shirdi Ellora Tour) పేరుతో తెలంగాణ టూరిజం ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. ప్రతి బుధవారం, శుక్రవారం హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ ( Shirdi Ellora Tour Package) అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీ ఆలయం, శని శింగణాపూర్ (Shani Shinganapur) లాంటి అధ్యాత్మిక (Spiritual) ప్రాంతాలతో పాటు ఎల్లోరా గుహలు (Ellora Caves) ఘృష్ణేశ్వర్ ‘Grushneshwar’ (జ్యోతిర్లింగ), ఔరంగాబాద్ మినీ తాజ్ మహల్(MINI TAj MAHAL) లను సందర్శించవచ్చు. ఇది 3 రాత్రులు, 4 రోజులు కొనసాగుతుంది. బస్సు మార్గంలో(bus Route) ఈ టూర్ను ఆపరేట్ చేస్తున్నారు.
తెలంగాణ టూరిజం ‘షిరిడీ ఎల్లోరా టూర్ ’ ప్రయాణం ఇలా..
Day 1: మొదటి రోజు హైదరాబాద్లో టూర్ ప్రారంభం అవుతుంది. దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ నుండి మధ్యాహ్నం 03:00 గంటలకు బస్సు బయలుదేరుతుంది. బషీర్బాగ్లో సాయంత్రం 04:00 గంటలకు.. యాత్రి నివాస్, సర్దార్ పటేల్ రోడ్, ప్యారడైజ్ సర్కిల్ నుంచి సాయంత్రం 04:45 కు, పర్యాటక్ భవన్, బేగంపేట్ నుంచి సాయంత్రం 05:00 గంటలకు, కేపీహెచ్బీ VRK సిల్క్స్ నుంచి సాయంత్రం 05:45 గంటలకు, చందానగర్ నుంచి సాయంత్రం 06:00 గంటలకు బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ( Overnight Journey) ఉంటుంది.
Day 2: రెండో రోజు ఉదయం శని శింగణాపూర్ (Shani Shinganapur) చేరుకుంటారు. దర్శనం అనంతరం షిరిడీకి బయలుదేరుతారు. ఆ తర్వాత హోటల్లో చెక్ ఇన్ అవ్వడం.. అనంతరం షిరిడీ ఆలయం దర్శనం (పర్యాటకుల స్వంత ఖర్చుతో) ఉంటుంది. భోజనం తర్వాత రాత్రి షిరిడీలోనే బస ఉంటుంది.
Day 3: మూడో రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు షిరిడీ నుంచి ఎల్లోరా గుహలకు బయలుదేరుతారు. అనంతరం ఘృష్ణేశ్వర్ (జ్యోతిర్లింగ), ఔరంగాబాద్ (మినీ తాజ్ మహల్)లను సందర్శిస్తారు. తిరుగు ప్రయాణంలో ఔరంగాబాద్ మీదుగా తిరిగి హైదరాబాద్కు ప్రయాణం అవుతారు.
Day 4: తెల్లవారుజామున ఉదయం 06.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
హైదరాబాద్ టూ షిరిడీ ఎల్లోరా టూర్ ప్యాకేజీ ధర
Hyderabad to Tour cost | AC బస్ ప్యాకేజీ అయితే పెద్దలకు రూ.3550, పిల్లలు (5 నుంచి 12సంవత్సరాలు) రూ.2890 చెల్లించాల్సి ఉంటుంది. అదే నాన్ AC బస్ ప్యాకేజీలో పెద్దలకు రూ.3100, పిల్లలకు రూ.2530 చెల్లించాల్సి ఉంటుంది. ఇక టూర్ ప్యాకేజీలో బస్సు టికెట్లు, హోటల్లో వసతి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.
గమనిక: రవాణా, వసతి ప్యాకేజీలో చేర్చబడింది. ఆహారం, దర్శనం, ఇతర ఖర్చులు పర్యాటకులే భరించాలి
పూర్తి వివరాల కోసం.. telangana tourism క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
https://tourism.telangana.gov.in/package/ShirdiElloraTour