మరిపెడ, జూన్ 26: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సేవ్యతండా పంచాయతీకి చెందిన భూక్యా యశ్వంత్ అరుదైన ఘనత సాధించాడు. హిమాలయ పర్వత శ్రేణుల్లోని 6,111 మీటర్ల ఎత్తులో ఉన్న యూనమ్ శిఖరాన్ని అధిరోహించాడు. ఈ నెల 23న ట్రాన్సెడ్ అడ్వెంచర్ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి శిఖరం అధిరోహణకు బయలుదేరాడు. నిర్ణీత సమయానికి కంటే ముందుగానే వెళ్లిన యశ్వంత్ ఆదివారం పర్వతంపై జాతీయ పతాకాన్ని ప్రదర్శించాడు. ఈ సందర్భంగా అతని తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.