హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ పథకాల తీరు తెన్నులను అధ్యయనం చేయటానికి మహిళా సాధికారతపై ఏర్పడిన పార్లమెంటరీ కమిటీ మూడు రోజుల పర్యటన కోసం సోమవారం రాష్ట్రానికి వచ్చింది. హీనా విజయ్ కుమార్ గావిట్ నేతృత్వంలో దాదాపు 15 మంది పార్లమెంట్ సభ్యులు బృందం శిశువిహార్, మహిళా కమిషన్, వృద్దాశ్రమం సహా పలు ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడ అమలు అవుతున్న పథకాలపై అధ్యయనం చేయనుంది.
ఆరోగ్యలక్ష్మీ, బాలామృతం, గిరిపోషన్ వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టి మహిళా ఆరోగ్యం, సాధికారికతలో దేశంలోనే తెలంగాణ ప్రభుతం ముందు వరుసలో నిలిచింది. మహిళా సాధికారత కమిటీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి ఫలితాలు దేశ వ్యాప్తంగా మరోసారి చర్చకు రానున్నాయి.