హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నుంచి స్కూళ్లు, కాలేజీల ఆటోలు, వ్యాన్ల ఓవర్లోడింగ్పై దృష్టి పెడుతున్నామని రవాణాశాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్ తెలిపారు. బిడ్డల భద్రత లక్ష్యంగా తల్లిదండ్రులు కూడా ఓవర్లోడింగ్ ఆటోలు, వ్యాన్లు, బస్ల సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడేకంటే, ముందస్తుగానే సమాచారం ఇస్తే అటువంటి వాహనాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రవాణా శాఖ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా వాహనాల తనిఖీల్లో భాగంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నదని తెలిపారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో 1,200కు పైగా వాహనాలు తనిఖీ చేసి, 165 విద్యాసంస్థల వాహనాలపై కేసులు నమోదు చేశామని, 40 బస్సులు సీజ్ చేశామని చెప్పారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోని విద్యాసంస్థల వాహనాలు త్వరగా ఎఫ్సీ తీసుకోవాలని కోరారు. లేకపోతే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.