మహబూబ్నగర్ : భారత వ్యవసాయ పరిశోధనా మండలి (Indian Council of Agricultural Research) నిర్వహించిన పీజీ ప్రవేశ పరీక్షలో వనపర్తి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో ఎమ్మెస్సీ (పీజీ) అడ్మిషన్ల కోసం 2021 సంవత్సరానికి గాను భారత వ్యవసాయ పరిశోధనా మండలి నిర్వహించిన ప్రవేశ పరీక్షలో మోజెర్లలోని ఉద్యాన కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు.
అఖిల భారత స్థాయిలో బి. తరుణ్ హార్టికల్చర్ విభాగంలో, జనరల్ కేటగిరీలో తొమ్మిదో ర్యాంకు, ఎస్టీ కేటగిరీలో మొదటి ర్యాంకు సాధించారు. డి.హతిరామ్, ప్లాంట్ సైన్స్ విభాగంలో, ఎస్టీ కేటగిరీలో దేశంలో మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నారని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎమ్. రాజశేఖర్ తెలిపారు.
కె. వెంకటరమణ జనరల్ కేటగిరీలో 61 ర్యాంకు (OBC-23), కె.మేఘన సాయిల్ సైన్స్ విభాగంలో 75వ ర్యాంకు (OBC-34), ఎస్. ధనుష్ ఎంటమాలజీ, జనరల్ కేటగిరీలో 76 వ ర్యాంకు (EWS-12) సాధించారు. సీహెచ్ రుక్తేశ్వర్ (OBC-47), బి.నందిని (SC-45), కె. ప్రశాంత్ (0BC -192), జి.దివ్య (0BC -200), ఎస్. శ్రీకాంత్ (ST -59) ర్యాంకులు సాధించారు.
వివిధ మెరిట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారికి శిక్షణనిచ్చిన ప్రొఫెసర్లను కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. నీరజ ప్రభాకర్, హార్టికల్చర్ డీన్ డా. ఎమ్. పద్మ అభినందించారు.