హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : గిరిజన ఆశ్రమ పాఠశాల్లో పనిచేస్తున్న భాషాపండితులు, వ్యాయాయ ఉపాధ్యాయ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయాలని పింగిలి శ్రీపాల్రెడ్డి కోరారు. ఎస్సీ, ఎస్టీ టీచర్లు ఉన్నత విద్యనభ్యసించేందుకు వేతనంతో కూడిన సెలవులు వినియోగించకొనే జీవో-342ను అమలు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ రెండింటిలో సభ్యుడిగా నియమితులైన ఆయన మంగళవారం నిర్వహించిన కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, ఎస్సీ కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం, ఎస్టీ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో నిర్వహించిన సమావేశాల్లో ఆయా అంశాలు ప్రస్తావించారు. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.