నెన్నెల, అక్టోబర్ 25 : మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుష్నపల్లి అటవీ రేంజ్ పరిధిలో 10 నెలలు దాటిన పులి పిల్లలు రెండు సంచరిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల తల్లిని విడిచిన ఈ రెండు పిల్లలు ఆవాసం కోసం ఒంటరిగా గాలిస్తున్నట్టు సమాచారం.
నాలు గు రోజుల క్రితం కుష్నపల్లి-బయ్యారం అడవిలో ఓ ఆవు తీవ్ర గాయాలతో కనిపించింది. పశువుల కాపరులు గుర్తించి అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వారు వచ్చి పరిశీలించారు. అడుగులు, దాడిని బట్టి అవి పులి పిల్లలుగా గుర్తించినట్టు సమాచారం. దాదాపు ఏడాది వయస్సు ఉన్న పిల్లలుగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. రెండింటిలో ఒకటి కుష్నపల్లి, మరోటి నీల్వాయి రేంజ్లో తిరుగుతున్నట్టు సమాచారం.