హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్గా ఆర్ లింబాద్రిని, వైస్ చైర్మన్గా వీ వెంకటరమణను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి గురువారం జీవో జారీచేశారు. కాంగ్రెస్ ప్రభు త్వం కొలువుదీరాక 54 మంది కార్పొరేషన్ చైర్మన్లను తొలగిస్తూ గత ఏడాది డిసెంబర్ 10న ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ జీవో లో వీరి పేర్లు కూడా ఉన్నాయి. అయితే, మరో వైస్ చైర్మన్ ఎస్కే మహమూద్ను తొలగించకపోవడంతో అప్పటినుంచి అదే పదవిలోనే కొనసాగుతున్నారు.
చైర్మన్, వైస్ చైర్మన్ను తొలగించడంతో వీరి స్థానంలో కొత్తవారిని నియమిస్తారని అంతా భావించారు. వీరినే తిరిగి కొనసాగించే అవకాశాలున్నట్టుగా ప్రభుత్వం సంకేతాలిచ్చింది. ఏకంగా సీఎం రేవంత్రెడ్డి సమీక్షకు వీరిని ఆహ్వానించారు. ఇంజినీరింగ్, బీఈడీ, లా, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల్లో ప్రవేశ పరీక్షల(సెట్స్)కు షెడ్యూళ్లను విడుదల చేయా ల్సి ఉన్నది. ఈ నేపథ్యంలోనే వీరిని తిరిగి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకొన్నది.