కొడంగల్, నవంబర్ 29: టీఆర్ఎస్తోనే బంగారు తెలంగాణ సాధ్యమని, అం దుకే రాజకీయభిక్ష పెట్టిన టీఆర్ఎస్లోకి మళ్లీ వచ్చినట్టు రేవంత్రెడ్డి అనుచరుడు రెడ్డి శ్రీను తెలిపారు. మంగళవారం ఆయన వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి కొడంగల్ ప్రజలకు ఎదో చేస్తాడనే నమ్మకంతో గతంలో కాంగ్రెస్లో చేరినట్టు శ్రీను తెలిపారు. కానీ ఆయన పదవుల ఆశలో పడి కొడంగల్ ప్రజలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని ఆరోపించారు. ఆయనది నమ్మించి గొంతుకోసే రాజకీయమని మండిపడ్డారు. రేవంత్ను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టలేదని విమర్శించారు. నమ్ముకున్న నాయకులను అణగదొక్కడం ఆయన నైజమన్నారు. కాంగ్రెస్ పార్టీలో పని చేసే నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు లేదన్నారు.