మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 7: తండ్రి నడుపుతున్న ట్రాక్టర్ కల్టివేటర్ ప్రమాదవశా త్తు తగలడంతో నాలుగేండ్ల కూ తురు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహబూబాబాద్ సమీపంలోని దర్గాతండాలో చోటుచేసుకొన్నది. దర్గాతండాకు చెందిన లకావత్ వీరన్న, మాధురి దంపతులకు ఇద్దరు కూతుళ్లు.
గురువారం వీరన్న తన ట్రాక్టర్ కల్టివేటర్ మరమ్మతు కోసం ఇంట్లో నుంచి బయటకు తీస్తున్నాడు. ఈ క్రమంలో పెద్ద కూతురు అనన్యశ్రీ (4) వెనుక నుంచి రాగా కల్టివేటర్ ఆమె తలకు బలంగా తగిలింది. వెంటనే కు టుంబ సభ్యులు ఏరియా హాస్పిటల్కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.