హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో చోటుచేసుకొంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో సోమవారం టీపీసీసీ అత్యవసర సమావేశం ఏర్పాటుచేసింది. సాయంత్రం 5.30 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ నేతృత్వంలో సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ‘సర్’ కో-ఆర్డినేటర్లతో అత్యవసర జూమ్ సమావేశం ఏర్పాటు చేసినట్టు వెల్లడించాయి. కానీ, పార్టీ నేతల విభేదాలపై అభిప్రాయాలు తెలుసుకోనున్నట్టు ప్రచారం జరుగుతున్నది.