పెషావర్ : పాకిస్థాన్లోని ఓ పోలీస్ స్టేషన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకొన్నారు. పలువురు పోలీసులను బందీలుగా పట్టుకున్నారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని బన్ను కంటోన్మెంట్లో ఈ స్టేషన్ ఉంది. ఓ తాలిబన్ మిలిటెంట్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా అతడు పోలీసుల చేతుల్లోని ఏకే-47 తుపాకీని లాక్కొని వారిపైకే కాల్పులు జరిపాడు. అదే భవనంలో అరెస్టయి ఉన్న దాదాపు 30 మంది తీవ్రవాదులను విడిపించాడు. అందరూ కలిసి పోలీస్ స్టేషన్ను ఆధీనంలోకి తీసుకొని పోలీసులను బందీలను చేశారు. వీరి కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు.