హైదరాబాద్ : దేశంలో ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. బీజేపీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించలేదు. బీజేపీ ప్రాంతీయ పార్టీలపై దాడి చేయాలని ప్రయత్నం చేస్తోందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేష్ నేత, మాజీ మంత్రి పెద్ది రెడ్డితో కలిసి తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాకముందే మాపై కొందరు దుష్ప్రచారం మొదలు పెట్టారు. ఆ దుష్ప్రచారం ఫలితాల తర్వాత కూడా కొనసాగుతోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కరీంనగర్ లో అభ్యర్థి పెట్టకుండానే ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు తెలిపాయి. కరీంనగర్ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానంలో టీఆర్ఎస్ గెలువదని దుష్ప్రచారం చేశాయని మండిపడ్డారు.
బీజేపీ- కాంగ్రెస్ రెండు ఒక్కటై స్వతంత్ర అభ్యర్థిని నిలబెట్టాయన్నారు.
ఈ దేశం బీజేపీ చేతిలో పూర్తిగా ఉంటే విచ్చిన్నం అవుతుందన్నారు. దేశంలో మహిళలను బీజేపీ కించపరుస్తోందని మండిపడ్డారు. నెహ్రు దేశానికి గట్టి పునాది వేశారు. ఆయన పేరు లేకుండా తీసివేశారు. కాంగ్రెస్ దద్దమ్మలు బీజేపీని ఎదురుకోవడంలో విఫలం అయ్యారు.
కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ పేరును గుర్తు పెట్టుకోవడం తప్ప చరిత్రను మరిచిపోతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ మహిళల పట్ల వ్యతిరేకత పెంచడానికి సిగ్గు ఉండాలిని ఘాటుగా విమర్శించారు. CBSE పరీక్ష లో వివాస్పద ప్రశ్న పత్రం తయారు చేసిన వాళ్ళను వెంటనే తొలగించాలన్నారు. శాసనమండలిలో 18 ఎన్నికలు జరిగితే అన్నింట్లో టీఆర్ఎస్ గెలిచిందన్నారు.