SRSP | హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): లక్ష్మి బరాజ్ నుంచి ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాల తరలింపును అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. సరిపడా వానలు కురవని నేపథ్యం లో ఎస్సారెస్పీ ఆయకట్టు కింద సాగుకు ఇబ్బంది లేకుండా కాళేశ్వరం ద్వారా ప్రాజెక్టులో నీటి మట్టాన్ని 30 టీఎంసీలకు చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 7 నుంచి వరద కాలువ ద్వారా కాళేశ్వర జలాలను శ్రీరాంసాగర్కు తరలించే ప్రక్రియను చేపట్టారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో నీటి నిల్వ నిర్దేశిత 30 టీఎంసీలకు చేరుకున్నది. మరోవైపు పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో ఎస్సారెస్సీలోకి 20 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది.
ఈ నేపథ్యంలో కాళేశ్వర జలాల తరలింపును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. రాజరాజేశ్వరం జలాశయానికి, అక్కడి నుంచి మిడ్మానేర్కు జలాల తరలింపు ప్రక్రియను కొనసాగించనున్నట్టు తెలిపారు. సోమవారం ప్రాణహితలో వరద సోమవారం మళ్లీ పుంజుకున్నది. సాయంత్రానికి 1.18 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. లక్ష్మి బరాజ్ 35 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన సమ్మక్కసాగర్ వద్ద వరద 1.02 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండటంతో 18 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా బేసిన్లో నాగార్జునసాగర్కు ఇన్ఫ్లో 8,890 క్యూసెక్కుల నుంచి 3,871 క్యూసెక్కులకు తగ్గిపోయింది.
బోయినపల్లి, జూలై 17: కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం అవుతున్నదని మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడలోని ఎస్సారార్ జలాశయం నుంచి దిగువన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎల్ఎండీ జలాశయానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మానకొండూర్ ఎమ్మెల్యే బాలకిషన్తో కలిసి వారు నాలుగు గేట్లను ఎత్తి.. 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.