మహబూబాబాద్ : రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్ లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం నెల్లికుదురు మండలంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా రైతు కో ఆర్డినేటర్ బాలాజీ నాయక్, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ మాధవి, వైస్ ఎంపీపీ వెంకటేష్, పరిపాటి వెంకట్ రెడ్డి, బిక్కు నాయక్, లక్ష్మా రెడ్డి, గుండా వెంకన్న, భీముడు, శ్రీనివాస్, విజయ్, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.