హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన సబ్సిడీ రుణాల పథకం ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. గత 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం అమలు కోసం రూ.863 కోట్లతో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ రూపొందించిన యాక్షన్ ప్లాన్ కాగితాలకే పరిమితమైంది. 6 నెలల క్రితమే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్రవ్యాప్తంగా 80,089 మంది ఎస్సీ యువత దరఖాస్తు చేసుకున్నారు.
వాటిలో ఎంపీడీవోలు ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో 7,326 దరఖాస్తులను ఎంపిక చేసి, బ్యాంకులకు పంపారు. అందులో బ్యాంకులు 5,389 దరఖాస్తులను (51.34 శాతం) మాత్రమే ఆమోదించాయి. ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం యూనిట్లను మంజూరు చేయకుండా పెండింగ్లో పెట్టడంతో వారు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు.