హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : కొత్త హెల్త్కార్డులు జారీ అయ్యేవరకు పాత హెల్త్కార్డులు అనుమతించాలని తెలంగాణ పెన్షనర్స్ జేఏసీ కోరింది. ఇప్పటి వరకు 25% హెల్త్కార్డులు మాత్రమే జారీ అయ్యాయని.. పాత హెల్త్కార్డులను అనుమతించకపోవడంతో పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారని, పాత కార్డులు అనుమతించాలని జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ సీఎస్ను కోరారు.