హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఏరికోరి గెలిపించుకున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి అధ్వాన పనితీరులో పోటీ పడుతున్నారు. రెండేండ్లలో ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరైన నిధుల వినియోగాన్ని విస్మరించారు. ‘ఎంపవర్డ్ ఇండియన్’ పేరిట ఇండిపెండెంట్ పబ్లిక్ ఇంటరెస్ట్ డాటా డ్యాష్బోర్డు తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ జాబితాలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం రూ.14.7 కోట్ల ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో ఆయన కేవలం రూ.47.5 లక్షలు (3.23%) మాత్రమే వినియోగించారు.
తర్వాత స్థానాల్లో నల్లగొండ ఎంపీ రఘువీర్రెడ్డి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ్రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, మెదక్ ఎంపీ రఘునందన్రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల, ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఉన్నారు.
