హైదరాబాద్, ఫిబ్రవరి 25 : తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ సెంట్రల్ ఫోరం (ఐఎంఎస్సీఎఫ్) అధ్యక్షుడిగా బీ శీనయ్య ఎన్నికయ్యారు. ఫోరం కార్యవర్గ నియామకానికి శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. టీఎన్జీవో కేంద్రం సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, కోశాధికారి రామినేని శ్రీనివాస్రావు నూతన కార్యవర్గానికి నియామక పత్రాలను అందజేశారు. అసోసియేట్ అధ్యక్షుడిగా టీ దయాకర్, ఉపాధ్యక్షులుగా బీ ఆనందం, సదాలక్ష్మి, ఎల్ కవిత, కార్యదర్శిగా గుండె వెంకటేశ్వర్, సంయుక్త కార్యదర్శులుగా ఎండీ అజర్ అహ్మద్, కే రవీందర్, కే అబితల్, కోశాధికారిగా ఎన్ రమేశ్బాబు, స్పోర్ట్స్ సెక్రటరీగా ఎండీ సాజిద్ హైదర్, ఆఫీస్ సెక్రటరీగా ఎన్ ప్రభాకర్రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీహెచ్ హరికిషన్, పబ్లిసిటీ సెక్రటరీగా వీవీ సుధాకర్రావు, కార్యవర్గ సభ్యులుగా కే అశోక్, సీ రాజు, కే సందీప్, కే శ్రీనివాసులును ఎన్నుకున్నారు.