హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : పిల్లల నిరాదరణకు గురవుతు న్నామంటూ తల్లిదండ్రులు నేరుగా కోర్టులకు రావడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. కన్నవారితో రాజీ ప్రయత్నాలు చేయాలని హితవు పలికిం ది. తొలుత సానుకూల ధోరణితో సమస్యను పరిషరించుకొనే చర్యలు చేపట్టాల ని సూచించింది. ఇలా చేయకుండానే పిల్లల నుంచి ఆస్తులను ఖాళీ చేయించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టులను కోరుతున్నారని పేర్కొన్నది. తనను పట్టించు కోని కుమారుడి నుంచి ఆస్తిని ఇప్పించాలన్న తన అభ్యర్థనలను అధికారులు పట్టించుకోకపోవడంతో సూర్యాపేట జిల్లాకు చెందిన 66 ఏండ్ల వృద్ధురాలు వేసిన పిటిషన్ను బుధవారం జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి విచారించారు.
పిటిషనర్ సంక్షేమాన్ని కుమారుడు పట్టించుకోలేదని, ప్రస్తుతం కుమార్తె వద్ద పిటిషనర్ ఉంటున్నారని న్యాయవాది వివరించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలి తం దక్కలేదని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. తమ సంరక్షణను పిల్లలు పట్టించుకోవడం లేదంటూ తల్లిదండ్రులు కోర్టులకు వస్తున్న కేసులు పెరు గుతున్నాయని తెలిపింది. ఈ కేసులో కుమారుడు పట్టించు కోవడంలేదని చెప్తున్నారని, కుమార్తె ఒకరే ఉంటే వారికీ తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పింది. ప్రత్యామ్నాయ మార్గాలైన రాజీ, చర్చలు లేకుండా నేరుగా పిల్లల నుంచి ఆస్తి ఇప్పించాలన్న పిటిషన్ల సంఖ్య పెరిగిందని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్పై వివరాలు సమర్పించాలని సూర్యాపేట అధికారులకు ఆదేశించింది. విచారణను ఈనెల 15కి వాయిదా వేసింది.