Telangana | తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ముఖ్య కార్యదర్శి కె.సురేంద్రమోహన్ బదిలీ అయ్యారు. ఆయన్ను జీఏడీలో రిపోర్టు చేయాలని సూచించారు. సురేంద్ర మోహన్ స్థానంలో బుర్రా వెంకటేశానికి గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.