హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో సంస్కరణల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. సీఎస్ చైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీలో సీసీఎస్ కార్యదర్శి, ఐటీ శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఎన్ఐసీ అధికారులు సభ్యులుగా ఉండనున్నారు.
ఈ మేరకు కమిటీని నియమిస్తూ పౌరసరఫరాల శాఖ వైస్ చైర్మన్ అండ్ ఎండీ డీఎస్ చౌహాన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతికతను వినియోగించి పీడీఎస్లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు స్మార్ట్-పీడీఎస్ కార్యక్రమాన్ని 2026లోపు అమలు చేయాలని కేంద్రం నిబంధన విధించింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం అమలుకు ప్రభుత్వం కమిటీని నియమించింది.