హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని పాత పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ‘తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ సీమ్-2026’ కోసం రూ.200 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ జీవో విడుదల చేశారు. క్యూర్ పరిధిలో చెల్లుబాటు అయ్యే పర్మిట్లు ఉన్న 11,254 డీజిల్, 7,512 పెట్రోల్ ఆటోలను 100శాతం ఎలక్ట్రిక్ రవాణా వ్యవస్థలోకి మారుస్తారు.
కాంపోనెంట్-ఏ కింద పాత ఆటో చాసిస్ను అలాగే ఉంచి ఏఐఎస్-123 ఆమోదం పొందిన ఎలక్ట్రిక్ కిట్ను అమర్చుకోవచ్చు. దీని కోసం గరిష్ఠంగా రూ. 1,50,000 లేదా కిట్ అసలు ధరను (ఏది తకువైతే అది) సబ్సిడీగా ఇస్తారు. కాంపోనెంట్-బీ కింద పాత ఆటోను స్రాప్ చేసి, కొత్త ఫ్యాక్టరీ-మేడ్ ఎలక్ట్రిక్ ఆటో (ఎస్5ఎం) కొనుగోలు చేసే వారికి రూ.1,50,000 నేరుగా ఆన్-రోడ్ ధరపై డీలర్ వద్దే సబ్సిడీగా తగ్గిస్తారు.