హైదరాబాద్: శాసనమండలి సభ్యుడిగా తాతా మధు (Tata Madhu)ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలోని తన చాంబర్లో ప్రొటెం చైర్మన్ సయ్యద్ జాఫ్రి.. తాతా మధుతో పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యమానికి శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి, మంత్రులు పువ్వాడ, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలు హాజరయ్యారు. ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మధు ఎన్నికైన విషయం తెలిసిందే.
ఉమ్మడి నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాల స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులుగా కల్వకుంట్ల కవిత, కే దామోదర్ రెడ్డి బుధవారం ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కాగా, తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు తాతా మధు ధన్యవాదాలు తెలిపారు.