Laxminarasimha Swamy Temple | దస్తురాబాద్ : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆదివారం ఉదయం 7.45 గంటలకు లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం నేత్రాలు, సుదర్శన చక్రాన్ని సూర్యకిరణాలు తాకాయి. కోటి భాస్కరుల తేజస్సు కలిగిన సుదర్శన చక్రాన్ని సూర్య కిరణాలు తాకడం విశేషమని ఆలయ అర్చకుడు నరేశాచార్యులు తెలిపారు. దాదాపు పది నిమిషాల పాటు స్వామి వారిని సూర్య కిరణాలు తాకాయని, ఇది స్వామివారి కృప అని, ఈ దృశ్యాన్ని చూడడం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.