నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 6: నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం చాక్పెల్లి గ్రామంలో సోమవారం వీరగల్లు విగ్రహం లభ్యమైనట్టు చరిత్ర పరిశోధకుడు తుమ్మల దేవ్రావు తెలిపారు. యుద్ధాలు జరిగిన స్థలంలో లేదా గ్రామ రక్షణకు పాల్పడినప్పుడు, వ్యా ధుల బారిన పడిన గ్రామస్తులను రక్షించే క్రమంలో వీర మరణం పొందిన వీరుడి జ్ఞాపకార్థం వీరగల్లును ప్రతిష్ఠిస్తారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 30 వీరగల్లు విగ్రహాలను వెలుగులోకి తీసుకొచ్చామని వివరించారు. ఇవి 17వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నట్టు తెలిపారు.