హైదరాబాద్ : తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని త్రిదండి చినజీయర్ స్వామి, మై హోం గ్రూప్ అధినేత రామేశ్వర్ రావు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలను తమిళనాడు గవర్నర్ను చినజీయర్ స్వామి ఆహ్వానించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సమతామూర్తి పేరిట భగవత్ రామామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు.
216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రప్రతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు.