హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): కామన్ లా ఎంట్రెన్స్ టెస్ట్ (క్లాట్) ఫలితాలలో శ్రీచైతన్య ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు రాష్ట్ర, ఆలిండియా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలుగు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో కే వినోత్న ఫస్ట్ ర్యాంకు, ఎన్ సాయి రాహుల్ 3 ర్యాంకు, షేక్ మహ్మద్ ఆసిఫ్ 5 ర్యాంకు, ఎ హర్షవర్ధన సాయి 10వ ర్యాంకు వంటి టాప్ 50లోపు ర్యాంకులను పొందగా, జాతీయస్థాయిలో వివిధ క్యాటగిరీలలో 85, 123, 470, 482, 547, 864, 1052, 1287, 1516, 2225, 3137, 3798, 3914, 4282, 6897, 8571 వంటి ఉత్తమ ర్యాంకులు సాధించారని వివరించారు. విద్యార్థులను, అధ్యాపక సిబ్బందిని సుష్మ అభినందించారు.