కురవి, ఆగస్టు 26 : రాఖీ పండుగకు తమ్ముడికి రక్షాబంధనం కట్టి, మిఠాయి తినిపించాలని ఆశపడిన ఆ అకకు విధి తీరని విషాదాన్ని మిగిల్చింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన మోటపోతుల రమేశ్ (34) బుధవారం అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన అంతిమయాత్రలో భాగంగా దింపుడుగళ్లెం వద్దకు మృతదేహాన్ని తీసుకురాగా.. రమేశ్ అక ధనలక్ష్మి తన తమ్ముడిని చూసి గుండెలవిసేలా రోదించింది. పుట్టెడు దుఃఖంతో పాడెపై ఉన్న తమ్ముడి చేతికి రాఖీ కట్టింది.
రమేశ్ తండ్రి పదిరోజుల క్రితం మృతి చెందాడు. ఆయన దశదినకర్మ గురువారం నిర్వహించాల్సి ఉండగా.. ఇంతలోనే రమేశ్ మృతిచెందడం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. గతంలో రమేశ్ తమ్ముడు కూడా అనారోగ్యంతో మృతిచెందినట్టు బంధువులు తెలిపారు. ఒకే కుటుంబంలో వరుస మరణాలు చోటుచేసుకోవడంతో బంధువులు, స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు.