శంషాబాద్ రూరల్, జూన్ 6: ఆటోలో తరలిస్తున్న 11 క్వింటాళ్ల నిషేధిత విత్తనాలను ఆదివారం శంషాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. షాద్నగర్ రాయికల్ చౌరస్తాలో శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు, షాద్నగర్ మండల వ్యవసాయశాఖ అధికారి నిశాంత్కుమార్, షాద్నగర్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించగా, ఏపీ 22 టీఏ 3119 నంబర్ టాటా ఏస్లో విత్తన ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ఆ ప్యాకెట్లకు బిల్లు, లాట్ నంబరు, గడువు తేదీ లేదని గుర్తించి ఆటోతో సహా సీజ్ చేశారు. నిందితుడు నారాయణపేట జిల్లాకు చెందిన పోలవరం హరిబాబుగా గుర్తించి కేసు నమోదు చేశారు.