హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులు, సరుకు రవాణా ద్వారా దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న రైల్వేస్టేషన్ల జాబితాలో సికింద్రాబాద్ నాల్గో స్థానంలో నిలిచింది. ఏడాది కాలంలో రూ.1,276 కోట్లకుపైగా ఆదాయాన్ని అర్జించింది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ అగ్రస్థానంలో ఉన్నది.
ఈ స్టేషన్ నుంచి రైల్వేకు సంవత్సరానికి రూ.3,337 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతున్నది. పశ్చిమబెంగాల్లోని హౌరా రైల్వేస్టేషన్ రెండోస్థానంలో, చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ మూడో స్థానంలో నిలిచాయి.