హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఉద్యానశాఖ నిర్వహించిన అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్ 2023లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జోన్ 11 ప్రథమ బహుమతులకు ఎంపికైంది. వివిధ వ్యాపార సంస్థలు, రెసిడెన్షియల్ కాలనీలు తమ ప్రాంతంలో పచ్చదనాన్ని మెరుగుపరిచి, వాటిని అభివృద్ధి పరిచే కార్యక్రమాలను ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లుగా గార్డెన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నది. దానిని ఈ ఏడాది జనవరి 10 నుంచి 20 వరకు నిర్వహించారు. వాటిలో ఎస్సీఆర్ జోన్లో 11 ఎంట్రీలకు మొద టి బహుమతి లభించింది. వాటిలో ఐదు రెసిడెన్షియల్ యూనిట్లు, నాలుగు స్థాపన యూనిట్లు ఉన్నట్టు ఎస్సీఆర్ జోనల్ పీఆర్వో రాకేశ్ తెలిపారు.