హైదరాబాద్ ఆట ప్రతినిధి, మార్చి 7 : రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హత్య కుట్రను సాట్స్ చైర్మన్ ( SATS Chairman ) అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఖండించారు. సోమవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ.. శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేసిన సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నిరంతరం ప్రజల్లో ఉండి వారి సమస్యలు పరిష్కరించి ఉద్యోగులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండే నాయకుడిపై ఇలాంటి కుట్రలు సరైనవి కావని సాట్స్ చైర్మన్ అన్నారు. తెలంగాణ ఉద్యమ కారుడు, మంత్రి శ్రీనివాస్గౌడ్కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక హత్య చేయాలనుకోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్న సందర్భంగా కుట్రలు, కుతంత్రాలకు దూరంగా అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని సాట్స్ చైర్మన్ సూచించారు.