హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయికి వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద రూ.11.50లక్షల విలువ చేసే కరెన్సీని కస్టమ్స్ అధికారులు గుర్తించి, పట్టుకున్నారు. లగేజ్ బ్యాగులో కరెన్సీ దాచి తరలించే ప్రయత్నం చేయగా.. స్కానింగ్ చేస్తుండగా.. కరెన్సీ పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు సదరు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.