హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : విద్య ప్రైవేటీకరణలో కేంద్రంలోని మోదీ సర్కారు సహా పలు రాష్ర్టాలు ముందంజలో ఉంటే.. తెలంగాణ సర్కారు మాత్రం ఇందుకు భిన్నంగా నడుచుకొంటున్నది. ఇంటర్ విద్యలో సర్కారు కాలేజీలను ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇంటర్ విద్యలో ఇంతకాలం ప్రైవేట్ జోరు ఉండగా.. ఇప్పుడు ప్రభుత్వ జోరు సాగుతున్నది. ఇంటర్ విద్యలో ప్రైవేట్ కాలేజీలను సర్కార్ కాలేజీలు దాటేశాయి. రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు 1,516 ఉండగా, ప్రభుత్వం, ప్రభుత్వ యాజమాన్యంలోని గురుకుల కాలేజీల సంఖ్య 1,560కి చేరింది. ఇంటర్ బోర్డు 2014 నుంచి ఇప్పటివరకు ఒక్క కొత్త ప్రైవేట్ కాలేజీకి అనుమతివ్వలేదు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 68 కాలేజీలను గతంలోనే ఇంటర్బోర్డు మూసివేసింది. ఇదివరకు 2,600 పైచిలుకు ప్రైవేట్ కాలేజీలుంటే.. ఇప్పుడు 1,560కి మాత్రమే పరిమితమయ్యాయి.
సర్కారు ముందు మరికొన్ని..
ఇంటర్ విద్య కమిషనరేట్ పరిధిలో 405 కాలేజీలు నడుస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరం మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేటకు కొత్త కాలేజీని ప్రభుత్వం మంజూరు చేసింది. దాంతో కాలేజీల సంఖ్య 406కు చేరుకొన్నది. మరికొన్ని జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందున్నాయి. మొత్తం 103 కాలేజీల ఏర్పాటుకు విజ్ఞప్తులు వచ్చాయి. వీటిలో 43 కాలేజీలకు సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. మరో 13 కాలేజీల ఏర్పాటు ప్రతిపాదనలను అధికారులు తిరస్కరించారు. మిగిలిన 47 కాలేజీలకు నివేదికలు సిద్ధమవుతున్నాయి.
ప్రభుత్వ కాలేజీల ప్రత్యేకతలు..
ప్రచారం చేయండి.. అడ్మిషన్లు పెంచండి
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): సర్కారు జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రత్యేకంగా అడ్మిషన్స్ డ్రైవ్ను నిర్వహించాలని ఇంటర్ విద్య అధికారులు నిర్ణయించారు. ఎస్సెస్సీలో ఉత్తీర్ణులైన విద్యార్థుల జాబిత తీసుకొని, సమీపంలోని విద్యార్థులందరినీ చేర్చుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఇంటర్ మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియను ఈ నెల 1 నుంచి ప్రారంభించారు. ఈ నెల 17వ తేదీతో మొదటి విడత అడ్మిషన్ల గడువు ముగియనుండగా, అడ్మిషన్లను పెంచడానికి ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ డీఐఈవోలు, నోడల్ అధికారులు, ప్రిన్సిపాళ్లకు పలు ఆదేశాలు ఇచ్చారు. కాలేజీల ఘనతను ప్రత్యేకతను ప్రచారం చేసి, అడ్మిషన్లను పెంచాలని సూచించారు.
ఇంటర్ విద్య ఆదేశాలివే..