హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు అధికారులు మరో అవకాశం ఇచ్చారు. రూ.500 ఆలస్య రుసుముతో ఈనెల 8 వరకు గడువు ఇచ్చారు.
మార్చి 18నుంచి ఏప్రిల్ 2వరకు జరగనున్న వార్షిక పరీక్షల కోసం ఇప్పటికే 5.03 లక్షల మంది ఫీజు చెల్లించారు.