బంజారాహిల్స్, మే 26: విశ్రాంత ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో ఎంవీఎస్ ప్రసాద్ కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను రెండ్రోజుల క్రితం యశోద దవాఖానలో చేర్చారు. పరిస్థితి విషమించి గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో పార్థివ దేహాన్ని దర్శనా ర్థం ఉంచారు.
1977 బ్యాచ్కు చెందిన ఎం వీఎస్ ప్రసాద్ ఉమ్మడి రాష్ట్రంలో కలెక్టర్గా, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్గా, టీటీడీ ఈవోగా, ఏపీఐఐసీ వైస్ చైర్మన్గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన అంత్యక్రియలు శనివారం మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు.