హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : నంద్యాల జిల్లా శ్రీశైలంలో పాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా సోమవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. సాయంత్రం స్వామి అమ్మవార్ల మహామంగళ హారతుల అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఏఈవో హరిదాస్ ప్రారంభించిన ఈ గిరిప్రదక్షిణ ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమై.. గంగాధర మండపము, ఆంకాళమ్మ ఆలయం, నందిమండపము, గంగాసదనము, బయలు వీరభద్రస్వామి ఆలయం పంచమఠాలు, మల్లమ్మ కన్నీరు పుషరిణి వద్దకు చేరుకొని తిరిగి నంది మండపము మీదుగా ఆలయ మహద్వారములోకి చేరుకొన్నది. గిరి ప్రదక్షిణ అనంతరం శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు.