సూపర్ స్టార్ మహేష్ బాబు సామాజిక నేపథ్యంలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీని వచ్చ ఏడాది సంక్రాంతి కానుకుగా విడుదల చేనయనున్నారు. ఈ సిసినిమా తర్వాత మహేష్.. రాజమౌళి, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు టాక్. మరో వైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోను సినిమా చేయనున్నట్టు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది.
అర్జున్ రెడ్డి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన సందీప్ రెడ్డి వంగా.. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసి మంచి హిట్ కొట్టాడు. త్వరలో మహేష్తో చేయబోతున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో అసలు విషయం బయటకు వచ్చింది. హ్యావెల్స్ కంపెనీ ప్రకటన కోసం మహేష్తో జతకట్టనున్నాడు సందీప్ రెడ్డి. ఈ రోజు హ్యావెల్స్ యాడ్ షూట్ జరగనుండగా, ఇందులో తమన్నా కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందట.