హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఎడ్సెట్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. బుధవారం సమావేశమైన అధికారులు రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు తొలివిడత వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ ఏడాది 203 బీఈడీ కాలేజీల్లో 18,856 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 29న నోటిఫికేషన్ విడుదల కానుండగా, డిసెంబర్ ఒకటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు డిసెంబర్ 30 నుంచి క్లాసులను ప్రారంభించనున్నారు.