హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విద్వేషపూరిత చర్యలపై బీఎస్పీ అధినేత్ర మాయావతి తీవ్రంగా స్పందించారు.
నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా చల్లారకముందే.. రాజాసింగ్ ఇలాంటి మతోన్మాద చర్యలకు పూనుకోవడం తీవ్రంగా గర్హనీయమని.. నిందించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాజాసింగ్ను అరెస్టు చేసినప్పటికీ.. బీజేపీకి.. తన పార్టీ నేతలను నియంత్రణలో ఉంచాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.