Rain Alert : భానుడి భగభగలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. కర్ణాటక నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ వాతావరణ మార్పులవల్ల గత కొన్ని రోజులుగా నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి వాతావరణం చల్లబడే అవకాశం ఉందని తెలిపింది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లొండ, మెదక్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అకాలవర్షాల నేపథ్యంలో ఉరుములు సంభవించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయట తిరగవద్దని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్లో కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా రైతులు కోతకు వచ్చిన పంటలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.