సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి
మధిర రూరల్, అక్టోబర్ 1: కేంద్ర వ్యవసాయ చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనున్నదని, ఆ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా మధిరలో మీడియాతో ఆయన మాట్లాడారు. స్వామినాథన్ కమిషన్ సిఫారస్సులను అమలు చేస్తామని, 2014 ఎన్నికలకు ముందు చెప్పిన నరేంద్రమోదీ.. వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలతో రైతులు పడే ఇబ్బందులను తెలియజేసేందుకు రైతన్న సినిమాను రాష్ట్రవ్యాప్తంగా శనివారం విడుదల చేస్తున్నట్టు తెలిపారు.